Monday, April 29, 2024

కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in car fell into canal in ap

అమరావతి:  కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రు వద్ద జరిగింది. బోండాడ సుమంత్(31), కోడే శరత్(28) అనే వ్యక్తులు బీమావరంలో వ్యక్తిగత పనులు చూసుకొని నిడమర్రుకు వస్తుండగా మందల్లపర్రు గ్రామ శివారులో కారు అదుపు తప్పడంతో చిన్నకాపావరం కాలువలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు జలసమాధయ్యారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు. మృతులు తాడేపల్లిపట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తాడేపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News