Saturday, April 27, 2024

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు… తెలంగాణ నుంచి ఇద్దరు

- Advertisement -
- Advertisement -

Two Members selected in National Best Teacher Awards

ఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు కేంద్రం ప్రకటించింది.  తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.  దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులకు కేంద్రం ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్‌ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య, సిద్ధిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్ఎం రామస్వామి ఎంపికయ్యారు.

 ఇద్దరు ఉపాధ్యాయులను మంత్రి హరీష్ రావు అభినందించారు. తన ఉపాధ్యాయ వృత్తిని సామాజిక సేవలో భాగంగా భావించి సేవలందించినందుకు దక్కిన గౌరవమని ప్రశంసించారు.  నిరుపేద విద్యార్థుల పట్ల చూపిన చొరవ సిద్దిపేట ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి పనితీరుకు , సంకల్పానికి నిదర్శనం అని కొనియాడారు.  పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టి కృషి, ఐక్యత కు ఈ అవార్డు అని ఈ సందర్భంగా వారికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News