- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో టికెన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. టికాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో సిఆర్పిఎఫ్, రాష్ట్రీయ రైఫీల్స్ గ్రూప్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
- Advertisement -