ఆగ్రా: 13 ఏళ్ల యుక్రెయిన్ బాలికపై పాక్ జాతీయుడు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని అగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆనంద్ కుమార్ అనే పాకిస్తాన్ జాతీయుడు ఎనిమిది సంవత్సరాల నుంచి యుపిలోని వ్రిందావన్లో నివసిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి, తండ్రి దగ్గర కొంత కాలం బాలిక ఉంటుంది. బాలిక తల్లి ఆనంద్ కుమార్ తో సహజీవనం చేస్తోంది. ఆనంద్ కుమార్ విద్యార్థులకు మ్యూజిక్ నేర్పిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 31 ఆనంద్ కుమార్ బాలిక ఇంట్లోకి వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా కనిపించడంతో అత్యాచారం చేశాడు. వ్యాట్సప్ చాటింగ్లో తన తండ్రికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు తెలియజేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్ కుమార్ను అరెస్టు చేశారు. బాలిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఎస్పి యుఎస్ సింగ్ తెలిపాడు.
యుపిలో బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం….
- Advertisement -
- Advertisement -
- Advertisement -