Monday, May 6, 2024

ఉదయ్ పూర్ హత్యపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -
Rajasthan
రియాజ్ అఖ్తరీ , గౌస్ మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు మంగలి కత్తి(క్లీవర్‌)తో ఉదయపూర్ నగరంలో కన్హయ్య లాల్‌ను హతమార్చారు.  వారు ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నామని వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఇది రాజస్థాన్‌లో మత హింసను ప్రేరేపించింది, ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు.

న్యూయార్క్:  ఐక్యరాజ్యసమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్ని మతాలను పూర్తిగా గౌరవించాలని, ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాలు సామరస్యంగా,  శాంతితో జీవించేలా చూడాలని పిలుపునిచ్చారు.  ఉదయపూర్‌లో ఒక టైలర్ హత్య తర్వాత రాజస్థాన్‌లో నెలకొన్న మతపరమైన ఉద్రిక్తతల మధ్య ఆయన ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్  తెలిపారు.

డుజారిక్ ఇలా అన్నారు: “ప్రపంచంలోని ఏ ప్రదేశంలోనైనా, ప్రజలు తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అనుమతించడం చాలా ముఖ్యం, జర్నలిస్టులు తమను తాము స్వేచ్ఛగా,  ఎలాంటి వేధింపుల బెదిరింపు లేకుండా వ్యక్తీకరించడానికి అనుమతించబడతారు.”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News