లక్నో: లాక్ డౌన్ నేపథ్యంలో ఖాకీలు కౄరమృగంలా ప్రవర్తించారు. సాటి మనిషి అనే దయలేకుండా విచక్షణా రహితంగా బాదాడు. ఉత్తర ప్రదేశ్లోని ఈత్వా ప్రాంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ వ్యక్తిని దారుణంగా చితకబాదారు. బూటు కాలుతో సదరు వ్యక్తి ఛాతీ మీదపెట్టి హింసకు గురి చేశారు. ఛాతీ మీద కాలు పెట్టినప్పుడు ఆ వ్యక్తి విలవిల కొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు ఓవర యాక్షన్ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆస్పత్రి, మెడికల్ షాపుకు వెళ్లిన కూడా కొందరు పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
UP cop’s suspending with merciless beating of a man
courtesy by NYOOOZ UP