Saturday, April 27, 2024

త్వరలో ‘టెట్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. బి.ఇడి, డి.ఇడి కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ, మన ఊరు -మన బడి పురోగతిపై చర్చించేందుకు శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టెట్ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. చివరిసారిగా గతేడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News