కాన్బెర్రా: రికార్డుల రారాజు విరాట్ కోహ్లిని మరో రికార్డు ఊరిస్తోంది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేలో మరో 23 పరుగులు చేస్తే టీమిండియా కెప్టెన్ కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. ఈ పరుగులను సాధిస్తే వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మన్గా కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. ఇప్పటి వరకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట రికార్డు ఉంది. సచిన్ 300 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను అందుకున్నాడు. అయితే కోహ్లి 23 పరుగులు చేస్తే 242వ ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. రెండో మ్యాచ్లో భారీ స్కోరు సాధించిన కోహ్లికి 23 పరుగులు చేయడం కష్టమేమి కాదని చెప్పాలి. అదే జరిగితే కోహ్లి కెరీర్లో మరో అరుదైన రికార్డు చేరుతుంది.
Virat Kohli 23 runs away from World Record