మన తెలంగాణ/ హైదరాబాద్ : త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ చేయడానికి ఇప్పటీ వరకు 2వేలమంది వాలెంటీర్లు దరఖాస్తు చేసుకున్నారని జిహెచ్ఎంసి కమిషనర్, ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఈవెబ్కాస్టింగ్కు మరింత మంది వాలెంటీర్లు అవసరముందని, అసక్తి గల అభ్యర్థులు, ముఖ్యంగా సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు జిహెచ్ఎంసిలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ వెబ్ కాస్టింగ్లో పాల్గొనే విద్యార్తి వాలెంటీర్లు సోంత ల్యాప్టాప్ను కలిగి ఉండాలన్నారు. పోలింగ్ , దాని ముందు రోజు ఈ వాలెంటీర్ల సేవలు వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వెబ్ కాస్టింగ్లో పాల్గొనే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు తగు పారితోషికం, సర్టిఫికెట్ను అందజేయబడుతుందని ఆయన వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు మై జిహెచ్ఎంసి యాప్ద్వారా, http//bit.ly/GHMCELECTIONS-2020 వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.