Thursday, May 16, 2024

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో అసద్‌కు నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో అసద్‌కు నిరసన సెగ

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, ఎంసి అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. సోమవారం నాడు జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌కు మద్దతుగా ఒవైసీ ప్రచారం నిర్వహించారు. స్థానికులు గతంలో ఎంఐఎంని గెలిపిస్తే జాంబాగ్‌లో ఎలాంటి అబివృద్ధి లేదని ఆందోళనకు దిగారు. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని మహిళలు ఒవైసీని ప్రశ్నించారు. ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి.. గెలవగానే మొహం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సమాధానం ఇవ్వకుండానే ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News