Saturday, May 4, 2024

సిరీస్ గెలిస్తే భారీ నజరానా: విండీస్ క్రికెట్ బోర్డు

- Advertisement -
- Advertisement -

అంటిగ్వా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను గెలిస్తే జట్టుకు భారీ నజరానా అందిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన వెస్టిండీస్ సిరీస్‌లో 10 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన రెండు టెస్టుల్లో ఒకటి గెలిచినా సిరీస్ విండీస్ వశమవడం ఖాయం. మరోవైపు విండీస్ జట్టు సిరీస్ గెలిస్తే భారీ మొత్తంలో బోనస్‌ను చెల్లిస్తామని బోర్డు వెల్లడించింది. భారత కరెన్సీలో దాదాపు 23 లక్షల రూపాయల వరకు జట్టుకు నజరానా అందిస్తామని తెలిపింది. బోర్డు నిర్ణయాన్ని విండీస్ ఆటగాళ్లు స్వాగతించారు.

ఎలాగైన సిరీస్‌ను గెలిచి ఈ భారీ మొత్తాన్ని అందుకుంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇరు జట్ల మధ్య ఈ నెల 24 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇదిలావుండగా ఇతర దేశాల జట్లతో పోల్చితే విండీస్ క్రికెటర్ల ఆదాయం చాలా తక్కువేనని చెప్పాలి. ఇలాంటి సమయలో బోర్డు భారీ మొత్తాన్ని అందించేందుకు ముందుకు రావడంతో క్రికెటర్లలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు చాలా కాలంగా బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య మ్యాచ్ ఫీజుల విషయమై గొడవలు కూడా జరుగుతున్నాయి. కానీ, ఇటీవల కాలంలో ఇటు క్రికెటర్లు, అటు బోర్డు కూడా పంతాలు వీడి సయోధ్యతో ముందుకు సాగుతున్నారు. దీంతో చాలా మంది స్టార్ క్రికెటర్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇది విండీస్ క్రికెట్ జట్టుకు శుభసూచకంగా చెప్పాలి.

West Indies players set England test series win bonus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News