Saturday, April 27, 2024

ఉరివేసి భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

గూడూరు : మద్యం మత్తులో కట్టుకున్న భార్యని అతికిరాతంగా ఉరివేసి చంపిన సంఘటన మండలంలోని అప్పరాజపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలోనికి వెళ్ళితే పోలీసులు గ్రామస్తుల కథనం ప్రకారం పిట్టల కనకమల్లు వెంకటమ్మ (58)కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది. వీరికి పెళ్లిళ్లు కూడా అయినాయి. వీరు బ్రతుకుతెరువు కోసం హైదరాబాదు వెళ్లారు.

అప్పరాజపల్లిలో కనకమల్లు వెంకటమ్మ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కనుక మల్లు మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం సేవించి ఇంట్లో గొడవపడేవాడని శుక్రవారం రాత్రి 10 గంటలకు వెంకటమ్మను డబ్బులు ఇవ్వమని గొడవ చేయగా ఇవ్వకపోవడంతో వెంకటమ్మను టవల్ తో ఉరివేసి చంపినట్లు తెలిపారు.  పరారీలో ఉన్న కనుక మల్లుపై  కొడుకు పిట్టల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిహెచ్ నగేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News