Sunday, May 12, 2024

భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య…

- Advertisement -
- Advertisement -

wife sets husband on fire

బెంగళూరు: భార్య వివాహేతరసంబంధం భర్త ప్రాణాలు తీసిన సంఘటన కర్నాటకలోని తుమకూరు జిల్లా బద్దిహిల్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నారాయణప్ప-అన్నపూర్ణ అనే దంపతులు బద్దిహిల్లి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నారాయణప్ప ఓ ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామకృష్ణ అనే వ్యక్తితో అన్నపూర్ణ వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం నారయణప్ప-అన్నపూర్ణ మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పంటించింది. రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని నారాయణప్ప తలపై బండరాయి ఎత్తేశాడు. దీంతో ఘటనా స్థలంలోనే నారాయణప్ప చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News