Friday, May 3, 2024

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చేగుంట: తల్లి కూతుళ్ల మద్య కలహాలతొ మనస్థాపం చెంది రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంట మండల కేంద్రానికి చెందిన పెండ్యాల భాగ్య(30) గత 10 సంవత్సరాల క్రితం కోడురూ మండలం రామంచకు చెందిన రాజుతో వివాహం జరగగా 3 సంవత్సరాల క్రితం బాగ్య ను రాజు వదిలి వెళ్లి పోవడంతో ఆమె తన తల్లీ దగ్గర ఉంటూ కూళీ పనులు చేసుకుంటు తన ముగ్గురు పిల్లల ను పోషించుకుంటుంది.

తల్లీతో చిన్న పాటి గొడవ తో మనస్థాపం చెంది ఇంటి నుండి వెళ్లి వడియారం రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అటు తండ్రి లేక ఇటు తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిత్తలు అమృత,అర్చన, ఆకిష్ లు అనాధలు అయ్యారు. కామారెడ్డి రైల్వే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని శవాన్ని కామిరెడ్డి ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం చేయిస్తున్నట్లు రైల్వే పోలీసు లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News