Monday, May 6, 2024

ఉప్పల్ డిపో సమీపంలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Man killed in Road Accident in Bahadurpally

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ డిపో సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఓ ఆటో బైక్‌ని ఢీకొట్టింది. దీంతో బైక్ వెనకభాగంలో కూర్చున్న మహిళ పక్కనే వెళ్తున్న ఆర్టీసీ బస్ కింద పడడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జనగామ జిల్లా అడవి కేశవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి, కనకయ్య దంపతులు.. నగరంలోని బాలానగర్ నుంచి తమ గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Woman died in Road Accident at Uppal Depot

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News