Wednesday, May 1, 2024

ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి

- Advertisement -
- Advertisement -

భోపాల్: సెల్ఫీ తీసుకుంటుండగా లోయలో పడి మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నీతూ మహేశ్వర్ అనే మహిళ తన కుటుంబంతో కలిసి జామ్ గేట్ ప్రాంతానికి పిక్నిక్ వెళ్లింది. కొండపై నిలబడి నీతూ సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి లోయలో పడింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లోయలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News