Monday, April 29, 2024

11 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Cricket Betting Racket Busted in Rajanna Sircilla

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సిఐ రవికుమార్ కథనం ప్రకారం… సిరిసిల్లలో చిప్ప పవన్, బొడ్డు రాకేశ్, రాంప్రసాద్‌లు, వేములవాడలో టేకురాల శివకుమార్, వరాల వంశీ, సావరం జశ్వక్‌లు, ఎల్లారెడ్డిపేటలో ఇమ్రాన్, మొయిన్, అజాం, సమీర్, ఉదయ్‌లు ఐపిఎల్ క్రికెట్ నేపథ్యంలో బెట్టింగులకు పాల్పడుతున్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. హేమంత్, వినయ్ అనే మరో ఇద్దరు పారిపోయారని సిఐ వెల్లడించారు.

Cricket Betting Racket Busted in Rajanna Sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News