Sunday, April 28, 2024

లోన్ డబ్బులు అడిగినందుకు ప్రాణం తీశాడు….

- Advertisement -
- Advertisement -

Woman murder inside moving taxi at west bengal

 

కోల్‌కతా: లోన్‌ డబ్బులు ఇవ్వమన్నందుకు ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళ ప్రాణాలు తీసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టోలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడియాలీలో ఓ వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ముడియాలీలో ఓ మహిళకు ట్యాక్సీ డ్రైవర్ పరిచయం కావడంతో ఇంటి పనులు చేస్తూ నమ్మకంగా ఉండేవాడు. దీంతో ట్యాక్సీ డ్రైవర్‌కు ఆమె లోన్ ఇప్పించింది. శుక్రవారం కారులో ఆమెను తీసుకెళ్తుండగా లోన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లోన్ విషయంలో ఇద్దరు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకోవడంతో కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె మృతదేహంతో సిటీ అంతా తిరిగి ఈస్ట్రర్న్ మెట్రోపాలిటన్ బైపాస్ రోడ్డులో ఓ కాలువలో మృతదేహం పడేసి వెళ్లిపోయాడు. తన భార్య కనిపించడంలేదని మహిళా భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News