Saturday, April 27, 2024

వుమెన్స్‌ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌: రాణించిన దీప్తి శర్మ.. ఆసీస్ లక్ష్యం 133

- Advertisement -
- Advertisement -

సిడ్నీ:ఐసిసి మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా శుక్రవారం ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టుకు శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ స్మృతి మందన(10), ష‌ఫాలీ వ‌ర్మ‌(29)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్(2) ఘోరంగా నిరాశపర్చింది. ఈ దశలో జెమిమా రోడ్రిగ్స్(26)తో జతకట్టిన దీప్తి శర్మ(49 నాటౌట్) ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్ ఔటైన దీప్తి శర్మ రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. దీంతో భారత్, ఆసీస్ జట్టుకు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Women’s T20 World Cup: IND set 133 runs target for AUS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News