Saturday, April 27, 2024

టిడిపి మహిళా జడ్పిటిసి ఇంటిపై రాళ్ల‌ దాడి.. ఆరు బైక్‌లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

YCP activists attack on TDP Leader house in Guntur

గుంటూరు: వినాయక నిమజ్జనంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా ప‌రిధిలోని పెద‌నందిపాడు మండ‌లం కొప్ప‌ర్రులో సోమ‌వారం రాత్రి గ‌ణేశ్ నిమ‌జ్జ‌నోత్స‌వ కార్యక్రమం సందర్భంగా వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. టిడిపి మాజీ జడ్పిటిసి శార‌ద ఇంటిపై రాళ్ల‌తో దాడికి పాల్ప‌డ్డారు. ఆమె ఇంట్లోకి చొర‌బ‌డి సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు ఇంటి వ‌ద్ద ఉన్న ఆరు బైక్‌ల‌ను పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. విషయం తెలుసుకుని బాపట్ల డిఎస్పి శ్రీనివాసరావు, పొన్నూరు సిఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగేంద్ర, రవీంద్రలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

YCP activists attack on TDP Leader house in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News