Monday, April 29, 2024

చంద్రబాబు చాలా దిగజారి పోయారు: ఎంఎల్ఎ రోజా

- Advertisement -
- Advertisement -

YCP MLA Roja Fires on Chandrababu Naidu

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసిపి ఎంఎల్ఎ రోజా ఫైర్ అయ్యారు. ప్రజలందరూ భోగి మంటలు వేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపులో మంటలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు సిఎంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ద్వజమెత్తారు. వైసిపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా జివొలు తెచ్చిందని… వాటిని భోగి మంటల్లో తగులబెట్టాలని బాబు చెప్పడం చూస్తుంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందని రోజా విమర్శించారు. రైతే రాజు అనే విధంగా అడిగినవి, అడగనివి కూడా ఇస్తున్న ఏకైక సిఎం జగన్ అని ఆమె కొనియాడారు. జగన్ ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ హాయిగా ఉన్నారని రోజా పేర్కొన్నారు.

YCP MLA Roja Fires on Chandrababu Naidu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News