Monday, May 6, 2024

కెసిఆర్ ను కలిసిన ఎల్లాపు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎల్లాపు సంఘం అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన వీర్ల వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ కు వీర్ల వెంకటేశ్వరరావు మొక్కను బహుకరించారు. ఎల్లాపు సంఘం కార్యకలాపాల విస్తృతానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో ఎల్లాపు కులస్థుల సంక్షేమానికి ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహకారం అందిస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News