Saturday, April 27, 2024

గణేష్ నిమజ్జనం… లారీ వెనుక చక్రాల కిందపడి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Young Man dead in Lorry accident

 

హైదరాబాద్: వినాయకుడిని నిమజ్జనం చేసి ఇంటికి వెళ్తుండగా యువకుడు లారీ పైనుంచి వెనుక చక్రాల కిందపడడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయిన సంఘటన హైదరాబాద్ రాష్ట్రం బేగంబజార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జైసాయి అనే యువకుడు శాలిబండలో నివసిస్తున్నాడు. అబిడ్స్ లో శుక్రవారం తెల్లవారుజామున వినాయకుడిని నిమజ్జనం చేసి లారీలో తన కాలనీవాసులతో కలిసి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. లారీ వెనుక చక్రాలు అతడి పైనుంచి పోవడంతో ఘటనా స్థలంలోనే జైసాయి చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News