- Advertisement -
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాలలో ఓ ఎస్సై ఓవరాక్షన్ యువకుడి ప్రాణం తీసింది. చీరాలలో మాస్క్ పెట్టుకోకుండా కిరణ్ కుమార్ అనే యువకుడు బైక్ పై వెళుతున్నాడు. మాస్క్ పెట్టుకోలేదన్న కోపంలో ఎస్సై యువకుడిని కొట్టాడు. దీంతో అతను బైక్ మీద నుంచి పడిపోవడంతో యువకుడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే సృహ తప్పి పడిపోతాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిరణ్ మృతి చెందాడు. అయితే కిరణ్ ను తాము కొట్టలేదని జీపులో తరలిస్తున్న సమయంలో కిందకు దూకడంతోనే గాయాలయ్యాయని చీరాల 2 టౌన్ సిఐ ఫిరోజ్ తెలిపారు.
- Advertisement -