Tuesday, April 30, 2024

24 గంటల్లో 37,724 కొత్త కేసులు.. 648 మరణాలు

- Advertisement -
- Advertisement -

37724 Covid 19 cases and 648 deaths reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 37,724 కొత్త కోవిడ్-19 కేసులు, 648 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కి చేరుకున్నాయి. వీటిలో 4,11,133 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 7,53,050 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 28,732 మంది బాధితులు ఈ మహమ్మారి బారినపడి మరణించారు. తెలుగురాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు కోటీ 47 లక్షల 24,546 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

గత 24 గంటల్లో 3 లక్షల 43,243 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్టు ఐసిఎమ్‌ఆర్ పేర్కొంది. మహారాష్ట్రలో 33,27,031 మందికి కరోనా వైరస్ సోకగా… 1,32,236 యాక్టివ్ కేసులున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,276 మంది కరోనాతో మృతి చెందగా… 1,82,217 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తమిళనాడులో 1,80,643 మందికి కోవిడ్ సోకగా… 2,626 మంది కరోనాతో చనిపోయారు. ఢిల్లీలో మొత్తం 1,25,096 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 3,690 మందిని కోవిడ్ కబలించింది. కర్నాటకలో 71,069 మంది కరోనా బారిన పడగా.. 1,464 మంది ప్రాణాలు విడిచారు. అటు ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా కేసులు 51,160కి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News