- Advertisement -
మేడ్చల్: ఘట్కేసర్ మండలంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లాకు చెందిన కాకి మహేశ్ రెడ్డి(24) పీర్జాదీగూడలో శ్రీచైతన్య కాలేజీలో క్లర్క్గా జాబ్ చేస్తున్నాడు. తాను చేసిన తప్పులు, అప్పులు వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటానని వాట్సప్ స్టేటస్లో పెట్టి చనిపోయాడు. తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపాడు. ఘట్ కేసర్-బీబీ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య మహేశ్ రెడ్డి రైలు కిందపడి చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడు మోతె మండలం రావిపహాడ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Young Man Suicide on Railway Track in Ghatkesar
- Advertisement -