Tuesday, May 14, 2024

కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయ పునఃప్రారంభోత్సవం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: శిథిలావస్థకు చేరుకున్న కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సింగరేణి సహకారంతో పునర్నిర్మాణం చేపట్టి నూతన హంగులతో కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వరబాబు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ వి.తిరుపతి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.ఆర్.కె ప్రసాద్, పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, డిఎస్పీలు రవి, ఆదినారాయణ, ఎస్బి సిఐ బాలాజీ, 3టౌన్ సిఐ వేణుచందర్, చుంచుపల్లి సిఐ గురుస్వామి, 2టౌన్ సిఐ ఎల్.రాజు, 1టౌన్ సిఐ బి.సత్యనారాయణ, జూలూరుపాడు సిఐ ఎం.నాగరాజు, ఆర్ఐలు సోములు, కామరాజు, దామోదర్, సుధాకర్, నాగేశ్వరరావు, సింగరేణి జీఎంలు రమేష్ రెడ్డి, కుమార్ రెడ్డి, దామోదర్, రాజీవ్ కుమార్, ధన్ పాల్ శ్రీనివాస్, కొత్తగూడెం సబ్ డివిజన్లలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ కు కొత్తగూడెం డిఎస్పీ వెంకశ్వరబాబు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

అనంతరం డిఎస్పీ కార్యాలయ పునఃనిర్మాణ శిలాఫలకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. తదుపరి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందులో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిఎస్పీ కార్యాలయ పునఃనిర్మాణానికి సహాయ సహకారందించిన సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మరియు పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకునేందుకు మరలా ఈ కార్యాలయాన్ని నూతన హంగులతో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇకపై సబ్ డివిజన్లలోని అధికారులకు, ప్రజలకు ఈ కార్యాలయంలో అందుబాటులో ఉండడం జరుగుతుందని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News