Saturday, May 11, 2024

తెలుగుదనం ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

Natyam movie Pre release event

ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సీనియర్ హీరోయిన్ భానుప్రియ కీలక పాత్రలో కనిపించనున్నారు. నృత్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిధిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాట్యం సినిమాను చూశాను, మొదటి క్షణం నుంచి ఆఖరి నిమిషం వరకు ఎంతో అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీ హిట్ సినిమాలను కూడా చూస్తూ మద్యలో పడుకుంటాను. అలాంటి నేను నాట్యం సినిమాను ఎంతో ఆసక్తిగా చూశాను. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. దాని కోసం ఈ చిత్రం చూడాలి’ అని అన్నారు.

సంధ్యా రాజు మాట్లాడుతూ.. నాట్యం సినిమా కోసం నేను, రేవంతే కాదు వెనకాల ఎంతో మంది శ్రమించారు. మంచి మ్యూజిక్ ఇచ్చిన శ్రవణ్‌కి థ్యాంక్స్. నాట్యం సినిమాను ఈనెల 22న అందరూ తప్పకుండా చూడండి’ అని తెలిపారు. డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ.. ‘తెలుగుదనం ఉన్న సినిమాను తీశాను. డిఫరెంట్ సినిమాను తీశాను. ప్రేక్షకులు ఇలాంటి వాటిని ఆదరిస్తే ఇంకా కొత్త సినిమాలు వస్తాయి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందినీ రెడ్డి, స్వప్నాదత్, ప్రశాంత్ వర్మ, రోహిత్, కరుణాకర్, శ్రవణ్ భరద్వాజ్, ఆదిత్య మీనన్, మనోజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News