హైదరాబాద్: పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అమరవీరులకు నివాళులర్పిస్తు న్నారు. హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. హోంమంత్రి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్, జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. సమాజ క్షేమం కోసం ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని చెప్పారు. పోలీసులకు, జవాన్లకు ఈ సమాజం ఎంతో రుణపడి ఉందన్నారు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనూ పోలీసులు అందించిన సేవలు మరవలేనివి అపి హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నరని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసు సంక్షేమ నిధి వివరాల డ్రైవ్ ను హోంమంత్రి ప్రారంభించారు.
TS Home Minister pays tribute to police martyrs