Wednesday, May 8, 2024

ఎపిలో మరో 10వేల కేసులు.. 82మంది మృతి

- Advertisement -
- Advertisement -

10548 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రతీరోజు 8 నుంచి 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 62,024మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 10,548 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 82మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,14,164కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 3,796మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 97,681మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు 3,12,687మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 36,03,345 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

10548 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News