Thursday, May 9, 2024

పరువు పోయిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

10th Class Student Commits Suicide in Vikarabad

కుల్కచర్ల: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చల్లాపూర్ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని హరిక్రిష్ణ(16)గా గుర్తించారు. ఉపాధ్యాయుడు తనను తోటి విద్యార్థుల ముందు మందలించాడని మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడు తన పరువుపోయేలా మాట్లాడినందుకే ఆత్మహత్య చేసుకుంటున్ననంటూ హరిక్రిష్ణ సూసైట్ నోట్ రాశాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News