Wednesday, May 1, 2024

దేశంలో కొత్తగా 11,039 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

11039 New Covid-19 Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 7,21,121 మంది శాంపిళ్లను పరీక్షించగా  11,039 మందికి కరోనా మహమ్మారి సోకింది. అదే స‌మ‌యంలో 14,225 మంది కోలుకున్నారు. మరో 110 మంది బాధితులు కరోనాతో మరణించారు. దీంతో ఇండియాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,07,77,284 కు పెరిగింది. దేశవ్యాప్తంగా 1,54,596 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 1,04,62,631 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,60,057 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 41,38,918 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. కాగా, భారత్ లో మంగళవారం వరకు మొత్తం 19,84,73,178 మందికి కోవిడ్-19 పరీక్షలు చేసినట్టు ఐసిఎంఆర్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News