Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 12,213 కరోనా పాజిటివ్ కేసులు….

- Advertisement -
- Advertisement -

12213 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 12,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.32 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర(4024), కేరళ(3488), ఢిల్లీ(1100) కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు రాష్ట్రాల్లోనే దాదాపుగా 70 శాతం కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి 4.26 కోట్ల మంది కోలుకోగా 58 వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 195 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్రం ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News