Monday, May 6, 2024

ఎపిలో కొత్తగా మరో 1392 పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

1392 New Corona Cases Registered in AP

అమరావతి: కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 61,050 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా మరో 1392 మందికి కోవిడ్ పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ బారిన పడి 11మంది బాధితులు మృతి చెందారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,44,359కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 6,802 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24గంటల్లో 1549 మంది కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 8లక్షల 12,517మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 21,235మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు వెల్లడించారు.

1392 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News