- Advertisement -
న్యూఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,396 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 27,892కు చేరింది. మూడు రాష్ట్రాల్లోనే 68 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఒకే రోజు 381మంది కరోనా బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,184 మంది కోలుకున్నారని.. ప్రస్తుతం దేశంలో కోలుకుంటున్నవారి శాతం 22.17గా ఉందని చెప్పింది. 16 జిల్లాల్లో గత 28 రోజులుగా ఒక్క కేసు కూబా నమోదు కాలేదని, తాజాగా మూడు జిల్లాలు కరోనా ఫ్రీగా మారిపోయాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.
1,396 New Corona Cases Registered in India
- Advertisement -