Sunday, May 5, 2024

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1417 new Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,430 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,417 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 12 మరణాలు సంభవించాయి. తాజాగా 1,897 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,029 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజా మరణాలతో కలిపి మొత్తం 3,546 మంది కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,10,834 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,88,259 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు బయటపడ్డాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు.

1417 new Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News