- Advertisement -
హైదరాబాద్: ఎకరా ఆయిల్ పామ్ సాగుకు నాలుగేళ్లకు రూ. లక్షకు పైగా ఖర్చు అవుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకంపై జరిగిన చర్చలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రూ.31,832 వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, మన దేశంలో 22 మిలియన్ టన్నుల వంట నూనె అవసరం ఉందని, కానీ దేశంలో కేవలం 7 మిలియన్ టన్నుల వంట నూనె ఉత్పత్తి అవుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
- Advertisement -