- Advertisement -
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంఎల్సి కవిత తెలిపారు. ఎంఎల్సి కల్వకుంట్ల కవితను టిబిజికెఎస్, సింగరేణి కాలరీస్ ఎస్సి, ఎస్టి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సిఎం కెసిఆర్కు ఎప్పుడూ అండగా ఉంటున్న సింగరేణి కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. సింగరేణి కార్మికుల సమస్యలను కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
- Advertisement -