Monday, May 6, 2024

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

16488 new covid-19 cases reported in india

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ మళ్లీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 12,771 డిశ్చార్జ్ అయ్యారు. మరో 113 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కి పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,07,63,451 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. 1,56,938 మంది కరోనా మహమ్మారితో మృతి చెందారు. ఇండియాలో ప్రస్తుతం 1,59,590 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,42,42,547 మందికి కరోనా టీకాలు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

16488 new covid-19 cases reported in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News