Saturday, May 4, 2024

పొరపాటున సొంత నౌకపై ఇరాన్ క్షిపణి దాడి: 19మంది మృతి

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్‌ః నావికా దళాల విన్యాసాల సందర్భంగా ఇరాన్ సైన్యం పొరపాటున తమ సొంత నౌకపై క్షిపణి దాడికి పాల్పడింది.ఈ ఘటనలో 19మంది మరణించగా, 15మంది గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం టెహ్రాన్‌కు 1,270 కిలోమీటర్ల దూరంలో జస్క్ నౌకాశ్రమం సమీపంలో ఈ ఘటన జరిగింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో విన్యాసాల సందర్భంగా ఆ మార్గంలో వస్తున్న కోణార్క్ నౌకపై ఇరాన్ సైన్యం క్షిపణిని ప్రయోగించింది. జరిగిన పొరాపాటును గ్రహించుకొని క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నెదర్లాండ్ నుంచి కొనుగోలు చేసిన కోణార్క్ నౌకను క్షిపణి ప్రయోగాలకు ఇరాన్ ఉపయోగిస్తుంది.

 

19 Killed after Iranian Warships hit by friendly fire

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News