- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 19,133 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 335 మంది బాధితులు మృతి చెందారు. అదే సమయంలో 20,028 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ప్రస్తుతం 90,629 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో మొత్తం రికవరీ రేటు 1.16 మిలియన్లు దాటింది. కోవిడ్ -19 పాజిటివిటీ రేటు 24.29% వద్ద ఉంది. గురువారం 78,800 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో 600 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
19133 new covid cases reported in Delhi
- Advertisement -