- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,982 కొత్త కేసులు, 12 మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 79,495కి చేరాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 627 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,869 యాక్టివ్ కేసులుండగా… 55,999 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో 463, మేడ్చల్ 141, రంగారెడ్డిలో 139 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. భాగ్యనగరంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.
1982 new corona cases reported in telangana
- Advertisement -