Monday, April 29, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో సోమవారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాలేపాల్, పేరేఖాక్రి ప్రాంతంలో హోరాహోరీగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఎవొబిలో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసు బలగాలు అనునిత్యం అడవి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ను అడ్డాగా మార్చుకున్న మావోయిస్టులు ఇప్పటికే ఎన్నో విధ్వంసాలకు పాల్పడుతున్న క్రమంలో పోలీసులు సైతం నిత్యం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు.

2 Women Maoists killed in Chhattisgarh Encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News