Saturday, April 27, 2024

విద్యార్థులకు శుభవార్త.. ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

2020 Dost notification released

 

హైదరాబాద్ : తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. లాక్‌డౌన్ కంటే ముందే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తైన విషయం తెలిసిందే. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి దోస్త్(తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్) నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ప్రకటించిన దోస్త్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను దోస్త్ కన్వీనర్ లింబాద్రి వివరించారు.

నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రధాన తేదీలు..
జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు
జూలై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
జూలై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూలై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్
జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లుజూలై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News