Friday, May 3, 2024

ఎపిలో 214 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

214 New Corona Cases Registered in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఎపిలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. ఇందులో 8,67,867 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,992 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఎపిలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఈక్రమంలో ఎపిలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7078కి చేరింది. రెండు, మూడు వారాలుగా ఎపిలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఎపిలో 400 కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

214 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News