Friday, April 26, 2024

బంగ్లాదేశ్ లో పడవ ప్రమాదం… 25 మంది జలసమాధి

- Advertisement -
- Advertisement -

25 Members dead in Boat accident in Bangladesh

 

ఢాకా: బంగ్లాదేశ్ లోని పద్మ నదిలో సోమవారం ఉదయం రెండు పడవలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది జలసమాధి అయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… షిబార్ పట్టణం సమీపంలో పద్మ నదిలో 30 ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఇసుక రవాణా చేస్తున్న ఓడను ఢీకొట్టింది. దీంతో ప్రయాణీకులు నదిలో పడిపోయారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై ఐదుగురిని రక్షించారు. ఇండియాలో రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయో… బంగ్లాదేశ్ లో పడవ ప్రమాదాలు అలాగే జరుగుతాయి. గత నెలలో 50 ప్రమాణికులతో వెళ్తున్న ఓడను కార్గో పడవ ఢీకొట్టడంతో 30 మంది మరణిచారు. గత  సంవత్సరం జూన్ లో పెర్రీ పడవ మునిగి పోయి 52 మంది మృత్యువాతపడ్డారు. 2015 ఫిబ్రవరిలో కార్గో బోటు ప్రమాదంలో 78 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News