Thursday, May 9, 2024

తెలంగాణలో కొత్తగా 2524 కేసులు.. 18మంది మృతి

- Advertisement -
- Advertisement -

12994 New Corona Cases Registered in AP

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 87,110 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా.. కొత్తగా 2,524మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. ఇక కరోనాతో మరో 18మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34,084 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,464 మంది బాధితులు కోలుకున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 307, మేడ్చెల్ జిల్లాలో 114, రంగారెడ్డి జిల్లాలో 142, న‌ల్ల‌గొండ జిల్లాలో 183, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 128 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

2524 New Corona Cases Report in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News