- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,188 శాంపిళ్లను పరీక్షించగా 275 మందికి కొత్తగా కోవిడ్-19 సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 90కి చేరింది. 24 గంటల్లో 55 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,555కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,559 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,906 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 3 లక్షల యాభై వేలు దాటాయి.
- Advertisement -