Saturday, April 27, 2024

బైక్ ను ఢీకొట్టిన కారు: ముగ్గురికి తీవ్ర గాయాలు, కారులో 40కేజీల గంజాయి

- Advertisement -
- Advertisement -

3 Injured as Car hits Bike in Visakhapatnam

విశాఖపట్నం: జిల్లాలోని చింతపల్లి మండలం పనసలపాడులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పనసలపాడు వద్ద వేగంగా వచ్చిన ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో 40 కేజీల గంజాయిని తరలిస్తున్న డ్రైవర్, కారును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారులో ఉన్న 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

3 Injured as Car hits Bike in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News