Saturday, April 27, 2024

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

indian-army

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులు-భద్రతాదళాలకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో, సీఆర్పీఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో అక్కడ దాక్కున్న ముష్కరులు జవాన్లపై దాడిచేశారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ముగ్గురు ఉగ్రవాదులు అన్సార్‌ గజ్వా ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు.

3 militants killed in encounter with forces in pulwama
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News